Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 3

2022-08-28 17:19:56 తెలంగాణ వ్యతిరేకులతో నాడు 'జై తెలంగాణ' నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో 'జై కిసాన్' నినాదాన్ని పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి, ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటదని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగు పడతదని సీఎం అన్నారు. ఈ దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని. జాతీయ రైతు నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

వజ్రోత్సవ భారతంలోనూ.. అపరిష్కృత రైతాంగ సమస్యలెన్నో...
--------------------------------------------------------------
దేశంలో దశాబ్దాల కాలం నుంచి రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు వజ్రోత్సవ స్వతంత్ర భారతంలో ఇంకా పరిష్కారాలు దొరకకపోవడం దురదృష్ణకరమన్నారు. దేశాన్నేలుతున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక అసంబద్ద విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఆదివారం నాటి జాతీయ రైతు సంఘాల సమావేశం స్పష్టం చేసింది. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎంను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ తీర్మానించింది. ఆదివారం నాడు జాతీయ సంఘాల నేతలతో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రెండో రోజు సమావేశం జరిగింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని శనివారం నాటి తీర్మానాన్ని అనుసరించి చర్చ కొనసాగింది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని సమావేశం తీర్మానించింది.

వ్యవసాయ రంగ సమస్యలు – పరిష్కారాలపై సుదీర్ఘ చర్చ
------------------------------------------------------
ఈ సందర్భంగా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్ దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోనున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఈ సమస్యలకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్ర్య కాలం నుంచి నేటి వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అవలంభించిన విధానాలు, పోరాట రూపాలను చర్చించారు. నాటి వ్యవసాయ పరిస్థితులకు, మారిన నేటి పరిస్థితులకు అవలంభించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్ ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని, సీఎం కేసీఆర్ ను కోరుతూ సమావేశంలో సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

జట్టుకట్టి, పట్టు పడితే.. సాధించలేనిది ఏమీ లేదు...
------------------------------------------------
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానమని, వ్యవసాయాన్ని ఈ దేశం నుంచి ఎవరూ వేరు చేయలేరు. రైతన్నలో శక్తి గొప్ప శక్తి దాగి ఉంటది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. మన సమస్యలకు పరిష్కారాన్ని మనమే అన్వేషించాలి. జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ లేదని నేను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసింది. నాకంటే ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. కాని, నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించాల్సిన నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో ఆనాడు లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు పలు రంగాలకు చెందిన మేధావులతో కొన్ని వేల గంటల మేధో మధనం చేసిన. తెలంగాణ పోరాటాలు విఫలం చెందడానికి కారణాలను అన్వేషించిన. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో, మొహమాటాలకు, బేషజాలకు తావు లేకుండా అటు రాజకీయ పంథాకు,ఇటు ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినం.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దాం..
-----------------------------------------------
‘‘ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికీ ఒక యువకుడిని పంపమని అడిగిన. ఓటు వేయడం ద్వారా తమ శక్తిని చాటే పార్లమెంటరీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన. వివిధ ఉద్యమ రూపాల ద్వారా ప్రజలను చైతన్య పరిచినం. ఓటు అనే ఆయుధాన్ని ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి లక్ష్యాన్ని చేరుకోగలిగాం. రాజకీయాలతో అయితదా? అని నన్ను అడిగిండ్రు. కానీ, వారి అనుమానాలను పటా పంచలు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిజం చేసి చూపించిన’’ అని సీఎం అన్నారు. రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజా జీవితాలు ప్రభావితమవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు అసెంబ్లీలు, పార్లమెంటులే వేదికలన్నారు. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం అయిన చరిత్ర స్వతంత్ర భారతంలో కనిపించదన్నారు. రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని సీఎం కేసీఆర్ అన్నారు.
246 views14:19
ओपन / कमेंट
2022-08-28 17:19:56
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
242 views14:19
ओपन / कमेंट
2022-08-28 17:13:43 సీఎం కేసీఆర్ వెంటే ఎన్నారైలు..: అనిల్ కూర్మాచ‌లం

తెలంగాణ లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో ఎన్నారైల‌మంతా కీల‌కంగా ప‌నిచేశామ‌ని తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచ‌లం పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ.. దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలిచింద‌న్నారు. అన్ని రంగాల్లోనూ ముందుంద‌ని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ద‌మ్ములేకే బీజేపీ నేతలు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత మీద అనవసర ఆరోపణలు చేస్తున్నార‌న్నారు. తెలంగాణ ప్రజల‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా దీన్ని ముక్త‌కంఠంతో ఖండిస్తున్న‌ట్టు చెప్పారు. తాము ఎమ్మెల్యే క‌విత స్ఫూర్తితోనే పనిచేస్తున్న‌ట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఎన్నారైలంద‌రం సీఎం వెంటే ఉంటామ‌ని అనిల్ కూర్మాచ‌లం స్ప‌ష్టం చేశారు. ఈ స‌మావేవంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎన్నారై నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
285 views14:13
ओपन / कमेंट
2022-08-28 17:13:39
ఎమ్మెల్సీ కవిత గారి మీద ఢిల్లీ ఎంపీ చేసిన‌ ఆరోపణల‌ను ఎన్నారైల‌మంతా తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబ‌ల్‌ కోఆర్డినేట‌ర్ మ‌హేశ్‌బిగాల పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆదివారం నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లకల్లోలం చేయాల‌ని బీజేపీ దండ‌యాత్ర చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. ప్రాంతీయ పార్టీల‌ను కూల‌గొట్టి తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కాషాయ‌పార్టీ కంక‌ణం క‌ట్టుకున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ వ్య‌వ‌వ‌హారం న‌చ్చ‌కే ఎన్డీఏ నుంచి బీజేపీ మిత్ర బృందాల‌న్నీ బయట‌కు వ‌చ్చాయ‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీని సీఎం కేసీఆర్ ఎదిరించి మాట్లాడుతున్నందునే అస‌త్య ఆరోప‌ణ‌లు, దాడులు చేస్తున్నార‌ని మ‌హేశ్ బిగాల మండిప‌డ్డారు. కావాల‌నే మునుగోడు ఎన్నిక తెచ్చార‌ని, ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. మునుగోడులో ప్ర‌జ‌లు టీఆర్ఎస్ వెంటే ఉంటార‌ని, గులాబీ అభ్య‌ర్థికే ప‌ట్టంగ‌డ‌తార‌ని ధీమా వ్య‌క్తంచేశారు.
306 views14:13
ओपन / कमेंट
2022-06-23 17:11:56
168 views14:11
ओपन / कमेंट
2022-06-23 17:11:46 ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హ‌రిదీప్ సింగ్ పూరీతో సమావేశమైన రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, ఐటీ శాఖ‌ల మంత్రి శ్రీ కేటీఆర్. ఈ సందర్భంగా హైదరాబాద్ కి సంబంధించిన ప‌లు ప్రాజెక్టులపై వినతులు సమర్పించారు.

హైద‌రాబాద్ మురుగునీటి పారుద‌ల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాల‌ని కేంద్ర‌మంత్రిని కేటీఆర్ కోరారు. సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 62 ఎస్‌టీపీ ప్లాంట్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

ఎస్‌టీపీల నిర్మాణాల‌కు రూ. 8,654 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్య‌యంలో మూడో వంతు అమృత్-2 కింద కేంద్ర ప్రభుత్వం రూ. 2,850 కోట్లు ఇవ్వాల‌ని విన‌తి చేశారు.

పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ మహానగరంగా ఎదుగుతున్నదని గుర్తు చేశారు. ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి.. 69 కి.మీ మెట్రో రైలు నెట్‌వర్క్, 46 కి.మీ సబ్-అర్బన్ సేవలు / మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎమ్‌ఎమ్‌టీఎస్‌) హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

హైద‌రాబాద్‌లో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అసెంబ్లీ నుంచి పారడైజ్ స్టేషన్ వరకు 10 కిలోమీటర్ల మేర వ్య‌క్తిగ‌త రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర‌మంత్రిని కేటీఆర్ కోరారు.
171 views14:11
ओपन / कमेंट
2022-06-23 13:47:30
220 views10:47
ओपन / कमेंट
2022-06-23 13:47:25 తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంలు అందజేయాలని నిర్ణయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. యూనిఫారాలు కుట్టే బాధ్యతను రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగింత.
219 views10:47
ओपन / कमेंट
2022-06-23 08:53:00
287 views05:53
ओपन / कमेंट
2022-06-23 08:52:56 దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండా తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మత విద్వేష రాజకీయాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.

#ByeByeModi
272 views05:52
ओपन / कमेंट