Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 2

2022-08-30 10:38:29
తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్.
204 views07:38
ओपन / कमेंट
2022-08-30 09:59:19
రేపు సీఎం శ్రీ కేసీఆర్ బీహార్ పర్యటన చేపట్టనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
సైనిక కుటుంబాలతో పాటు, ఇటీవలి సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం 5 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేయనున్నారు.
206 views06:59
ओपन / कमेंट
2022-08-30 09:24:17
సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం
సెప్టెంబర్ 3 వ తేదీ క్యాబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ భవన్ లో సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, తదితర అంశాలపై ఈ సమావేశం చర్చిస్తుంది.
(File Photo)
219 views06:24
ओपन / कमेंट
2022-08-29 16:18:48
గుజ‌రాత్ మోడ‌ల్ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేసింది బీజేపీ పార్టీ : సీఎం శ్రీ కేసీఆర్
323 views13:18
ओपन / कमेंट
2022-08-29 15:33:06
బీజేపీ ముక్త్ భారత్ కు అంతా కదిలిరావాలి : సీఎం శ్రీ కేసీఆర్
325 views12:33
ओपन / कमेंट
2022-08-29 15:02:49
ఆత్మగౌరవంతో ఉందామా ?
ఢిల్లీ గులాంలకు సలాం కొడదామా ?
- సీఎం శ్రీ కేసీఆర్
327 views12:02
ओपन / कमेंट
2022-08-29 14:40:13
దేశంలో బీజేపీ ప్రభుత్వం పోయి.. రైతుల ప్రభుత్వం రాబోతోంది : సీఎం శ్రీ కేసీఆర్
299 views11:40
ओपन / कमेंट
2022-08-29 13:13:48
టీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్.
296 views10:13
ओपन / कमेंट
2022-08-28 17:19:57 సేవ్ ఇండియన్ ఫార్మర్స్.. వాస్తవిక భారత నిర్మాణం సీఎం కేసీఆర్ తోనే జరగాలి
-------------------------------------------------------------------------
ప్రధాని మోడీ రైతు వ్యతిరేక చర్యలు దేశ రైతాంగానికి ప్రమాదకరంగా మారాయని అటువంటి ప్రమాదం మల్లోసారి రాకుండా చూడాల్సిన గురుతర బాధ్యత దేశ రైతాంగం మీదనే ఉన్నదని తమిళనాడుకు చెందిన రైతులు స్పష్టం చేశారు. దేశం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది.. ప్లీజ్ సేవ్ ఇండియన్ ఫార్మర్స్.. అంటూ వారు సీఎం కేసీఆర్ ను అభ్యర్థించారు.

వాస్తవిక భారత నిర్మాణం కేసీఆర్ వంటి నాయకుల చేతుల మీదుగానే ప్రారంభం కావాలని, ఒకే దేశం – ఒక్కటే రైతు సంఘం అనే నినాదంతో అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగితేనే మన సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం అవుతాయని, ఈ దిశగా మమ్మల్ని నడిపించాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమావేశంలో పాల్గొన్న సౌత్ ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.

తెలంగాణ రైతు పథకాలు దేశమంతటా అమలు చేయాలి
----------------------------------------------------
దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు తదితర వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలోని పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, కానీ వీటిని దేశవ్యాప్తంగా అమలు పరచడం అనేది చిత్తశుద్ధి ఉంటే సాధ్యమయ్యేదేనని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.

దళితబంధు విప్లవాత్మకం..
-------------------------
సమావేశంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాఘవేంద్ర కుమార్ అనే దళిత రైతు నిన్న క్షేత్రస్థాయి పర్యటనలో దళిత బంధు పథకం అమలు తీరుతెన్నులను తెలుసుకొని వచ్చి తన అనుభవాల్ని వివరించారు. దళితబంధు పథకం ఒక విప్లవాత్మక పథకమని, అణగారిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని, దళితబంధు మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమే అయినప్పటికీ, కీలక నిర్ణయాధికారం అంతా కేంద్రం చేతుల్లోనే ఉన్నదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రంలోని రాజకీయ అధికారంలో దేశ రైతాంగం భాగస్వామ్యం కాకపోతే.. వ్యవసాయాధారిత భారతదేశంలో సంపూర్ణ ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు కానేకాదని సీనియర్ రైతు నేతలు అభిప్రాయపడ్డారు. ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో స్వతంత్రదేశంలో ‘‘స్వతంత్ర గ్రామాలను నిర్మిద్దాం’’ అని వారు నినదించారు.

సీఎం కేసీఆర్ దార్శనికతతోనే ప్రశాంతంగా తెలంగాణ..
--------------------------------------------------
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, కృషి వల్లనే శాంతి ఫరిఢవిల్లుతున్నదని, ఇటీవల పెచ్చరిల్లుతున్న మత విద్వేషాల ప్రభావం తెలంగాణ పైన, హైదరాబాద్ పైన పడలేదనే విషయాన్ని మేం గ్రహించామని, ఇది నిజంగా బీజేపీ మతతత్వ శక్తులకు సరైన గుణపాఠంగా నిలిచిందని సమావేశంలో పాల్గొన్న రైతులు స్పష్టం చేశారు.

జాతీయ రైతు సంఘాల నేతలను సన్మానించిన సీఎం కేసీఆర్..
-----------------------------------------------------------
జాతీయ రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ శ్రీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శ్రీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు శ్రీ ఎ.జీవన్ రెడ్డి, శ్రీ బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డితోపాటు దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు. కాగా, మూడు రోజులపాటు తెలంగాణలో సాగిన ‘జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన’ నేటితో ముగిసింది.
355 views14:19
ओपन / कमेंट
2022-08-28 17:19:56 దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వాములు కావాలి..
-----------------------------------------------
రాజకీయాలంటే అయోమయం అవసరం లేదు. మొహమాటాల నుంచి రైతు నేతలు బయటపడి రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములై, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయా సందర్భాలను బట్టి, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరిస్తూ, అవసరమైన చోట ఉద్యమ పంథాను కూడా కొనసాగిస్తూ సాగే, ప్రజాస్వామిక పార్లమెంటరీ పంథా ద్వారా మాత్రమే ప్రజాస్వామిక దేశాల్లో ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర సాధనే నిదర్శనమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

‘‘ఎక్కడ ఆందోళన అవసరమైతదో అక్కడ ఆందోళన చేద్దాం – ఎక్కడ రాజకీయాలు అవసరమైతయో అక్కడ రాజకీయాలు చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం..
---------------------------------------------
‘‘ఈ సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులందరూ మీ మీ ప్రాంతాలకు చేరుకొని, మనం తీసుకున్న నిర్ణయాలను, అంశాలను మీ సంఘాల నేతలు, రైతులతో చర్చించండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశమవుదాం. జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదాం. దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విందాం. జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను, పలు రంగాలకు చెందిన మేధావులను, జర్నలిస్టులను పిలిచి, వారందరితో లోతైన చర్చలు, విశ్లేషణలు చేద్దాం. ఆ సమావేశంలో దేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సమస్యల నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను, కార్యాచరణ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకుందాం. రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామస్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘ నిర్మాణాలు చేద్దాం. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిద్దాం. తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల వ్యాప్తిలాగా, రైతుల సమస్యల పరిష్కార సాధన కోసం కావాల్సిన భావజాలాన్ని దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యాప్తి చేద్దాం.. అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘అవ్వల్ దర్జా కిసాన్’ లను తయారు చేద్దాం..
----------------------------------------
"నేను స్వయానా ఒక రైతును. రైతు కష్టాలు నాకు తెలుసు. వాటిని పరిష్కరించం ఎట్లనో కూడా తెలుసు. ఢిల్లీ, హైదరాబాద్ సహా, ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానించేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందాం. ఒక సామాన్య రైతు కూడా దేశ ప్రధానితో ధీటుగా చర్చించే విధంగా వారిని తీర్చిదిద్దుదాం. రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటాన్ని ప్రారంభిద్దాం. దేశ రైతును ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే ‘అవ్వల్ దర్జా కిసాన్’ గా తయారు చేద్దాం’’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే నడుద్దాం..
------------------------------------------------
ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తర ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సీనియర్ రైతులు మాట్లాడుతూ ‘‘మనం ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిష్కారానికి కేవలం ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకొని మన జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించాం. ఇకనుంచి సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందాం’’ అని దేశ రైతాంగానికి పిలుపునిచ్చారు.

దేశ రైతు ఒక్క ఎకరం భూమి కూడా కోల్పోవద్దు..
-----------------------------------------------
నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, కరంటు మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, రైతు పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సమావేశం అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి, సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ గద్దలకు దేశీ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతున్నదని, దీన్ని తిప్పికొట్టాలని, ఒక్క ఎకరం కూడా దేశ రైతు తన భూమిని కోల్పోకుండా కాపాడుకుంటాం.. అని సమావేశం తీర్మానం చేసింది. రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని నమ్మబలుకుతూ.. మండీలను ఖతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి, దేశ ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా క్షమాపణలు చెప్పించిన ఘనత భారత దేశ రైతాంగానికి చెందుతుందని పంజాబ్ కు చెందిన సీనియర్ రైతులు ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.
261 views14:19
ओपन / कमेंट