2022-05-05 15:26:28
సిద్దిపేట జిల్లా ములుగు ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ 2వ సమావేశంలో
మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ...
వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి
వ్యవసాయ యాంత్రీకరణలో ఊబర్, ఓలా తరహా సేవలు అందస్తే అది విప్లవాత్మక మార్పుకు నాందీ అవుతుంది
ఊబర్, ఓలా కార్లు, బైకులు నడుపుతూ లక్షల మంది ఉపాధి పొందుతున్నారు
వ్యవసాయ రంగంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి రావాలి
ఐటీ, పరిశ్రమల శాఖ ఈ విషయంపై చొరవ తీసుకోవాలి
వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, వ్యవసాయ యాంత్రీకరణలో ఊబర్, ఓలా తరహా సేవలు అందస్తే అది విప్లవాత్మక మార్పుకు నాందీ అవుతుంది
కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి .. అందుకే వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించాలి
రైతువేదికలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి .. ఐటీ శాఖ సహకారంతో రైతులకు వ్యవసాయంలో మెళకువలు తెలుసుకునేందుకు సాయం అందించాలి
వ్యవసాయంలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శం
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యం వ్యవసాయం
కేసీఆర్ ఆలోచనలు అన్నీ రంగరించి వ్యవసాయం బలోపేతం చేసి, రైతును రాజుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి నుండి నేడు కేంద్రం తెలంగాణలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనుగోలు చేయలేక చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది
వ్యవసాయరంగంలో అనుసరించాల్సిన విధానాల రూపకల్పనలో భాగంగా సబ్ కమిటీ అవసరాన్ని బట్టి వివిధ ప్రాంతాలను సందర్శించి పూర్తి అవగాహనతో విధానాలు రూపొందించాలి
వానాకాలంలో రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం
పప్పు, నూనెగింజల పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం
రైతుబంధు అందుకుంటున్న వారిలో 92.5 శాతం మంది ఐదెకరాల లోపు వారే .. 5 నుండి 10 ఎకరాలు ఉన్నవారు ఆరుశాతం
వ్యవసాయం గౌరవ ప్రదమైనది, పని చేయడం నామోషీ కాదు అన్న భావన మన యువతలో రావాలి .. ఆ దిశగా కృషిచేయాలి ... విదేశీ యువతకు, మన యువతకు ఉన్న తేడా అదే
వినియోగదారులకు బలవర్దకమైన, నాణ్యమైన ఆహారం అందేలా కృషిచేయాల్సిన మనందరి మీద ఉంది
రాష్ట్రంలోని రైతులను వివిధ ప్రాంతాలకు విడతల వారీగా తీసుకువెళ్లి అక్కడి వ్యవసాయ పద్దతులు, విధానాలపై అవగాహన కల్పించాలి
ఉద్యానపంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలి
రాష్ట్రంలో విపక్షాలు రైతుల ప్రయోజనాలను వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు
రైతుల శ్రేయస్సు దృష్ట్యా ధాన్యం కొనుగోలుకు నిర్ణయం
5 లక్షల ఎకరాలలో ఆలుగడ్డ సాగయితే తెలంగాణ అవసరాలు తీరతాయి .. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి
- మంత్రి శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ...
వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల ఆలోచనా విధానం మారాలి
రైతుల ఆదాయం రెట్టింపు అన్నది ఒక్క చైనాలోనే సాధ్యం అయింది .. నాకున్న సమాచారం ప్రకారం అది మరెక్కడా సాధ్యం కాలేదు
2022 వరకు మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని విఫలమయ్యారు
దేశంలో దాదాపు 60 - 65 శాతం జనాభా వ్యవసాయం , దాని అనుబంధ రంగాల మీద ఆధారపడింది .. కానీ దేశ జీడీపీలో దాని వాటా 15 శాతం దాటడం లేదు
వ్యవసాయంలో రైతుకు ఆదాయం ఎలా వస్తుందో ఆలోచన చేయాలి .. చైనా, ఇజ్రాయిల్ లలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి
1987 లో చైనా - ఇండియా జీడీపీ సమానం
35 ఏళ్లలో చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరింది .. ఇండియా 3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది
తెలంగాణలో వరి మళ్లలో చేపలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది .. ఈ దిశగా ప్రయత్నించాలి
వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువత ఈ దిశగా మళ్లే అవకాశం ఉంది
తెలంగాణలో బ్లూ, పింక్, వైట్, ఎల్లో,గ్రీన్ విప్లవాలు విజయవంతమయ్యే అవకాశాలున్నాయి
ఈ తరం, కొత్తతరం ఎందుకో వ్యవసాయానికి దగ్గర కావడం లేదు
పాత, కొత్త అనుభవాలతో ఒక కొత్త విధానం తీసుకురావాలి .. యువతను ఆకర్షించాలి
తెలంగాణ 32 జిల్లాలలో ప్రతి చోటా 25 ఎకరాలలో రైతుశిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి .. కొత్త తరానికి వ్యవసాయాన్ని పరిచయం చేయాలి
వ్యవసాయానికి ఆధునికతను జోడించేలా శాస్త్రవేత్తలు ఆలోచించాలి
చిన్ననాటి నుండే పిల్లలలో వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేయాలి
పౌల్ట్రీ, పత్తి, వేరుశెనగలకు తెలంగాణ ప్రసిద్ధి
ఏడాదికి రెండు సార్లు 10 రోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక్రమం నిర్వహించాలి .. దీనిపై క్యాలెండర్ తయారుచేయాలి .. రైతు దినోత్సవం నిర్వహించాలి
151 views12:26