ఎమ్మెల్సీ కవిత గారి మీద ఢిల్లీ ఎంపీ చేసిన ఆరోపణలను ఎన్నారైల | TRS Party
ఎమ్మెల్సీ కవిత గారి మీద ఢిల్లీ ఎంపీ చేసిన ఆరోపణలను ఎన్నారైలమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్బిగాల పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లకల్లోలం చేయాలని బీజేపీ దండయాత్ర చేస్తున్నదని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను కూలగొట్టి తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కాషాయపార్టీ కంకణం కట్టుకున్నదని ధ్వజమెత్తారు. ఈ వ్యవవహారం నచ్చకే ఎన్డీఏ నుంచి బీజేపీ మిత్ర బృందాలన్నీ బయటకు వచ్చాయని తెలిపారు. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఎదిరించి మాట్లాడుతున్నందునే అసత్య ఆరోపణలు, దాడులు చేస్తున్నారని మహేశ్ బిగాల మండిపడ్డారు. కావాలనే మునుగోడు ఎన్నిక తెచ్చారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. మునుగోడులో ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటారని, గులాబీ అభ్యర్థికే పట్టంగడతారని ధీమా వ్యక్తంచేశారు.