Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 13

2022-06-08 16:42:30 తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన 9 వేల కోట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నరు.

ఆర్థిక సంఘం నివేదికను తొక్కిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా..

ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 వేల కోట్లు స్టేట్ స్పేసిఫిక్ గ్రాంట్ గా, సెక్టార్ స్పేసిఫిక్ గ్రాంట్ గా ఇవ్వమని చెబితే ఎగబెట్టిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.

మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు 24 వేల కోట్లు ఇవ్వమంటే పట్టించుకోలేదు. ఐటీఐర్ ను రద్దు చేస్తరు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు...నిధులు ఇవ్వరు..బయ్యారం ఉక్కు ఫ్యాక్టీరీ పెట్టరు.

తెలంగాణకు అన్యాయం తప్ప బీజేపీ ఏం చేయడం లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. తెలంగాణ గుండెల నుండి పుట్టిన పార్టీ.

టూరిజం ఎకో ప్రాజెక్టు ను త్వరలోనే ప్రారంభించుకుందాం..

35 కోట్లు నర్సాపూర్ నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులకు మంజూరు చేయడం జరిగింది.

గోదావరి నీళ్లు తేవడమే ఒక్క పని మిగిలి ఉంది. ఆ పని త్వరలోనే పూర్తవుతుంది.
184 views13:42
ओपन / कमेंट
2022-06-08 16:42:29 మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను ప్రారంభించిన మంత్రులు శ్రీ హరీష్ రావు, శ్రీ పువ్వాడ అజయ్‌కుమార్‌. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ మదన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ, కాంగ్రెస్ లపై ఫైర్ అయిన మంత్రి శ్రీ హరీశ్ రావు

-తెలంగాణకు మాటలు - గుజరాత్ కు మూటలు
-ప్రభుత్వ రంగ సంస్థలపై బీజేపీ పాలసీ ఏంటో చెప్పాలి
-తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు
-15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 9 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలి

మూడు దశాబ్ధాల కలను నిజం చేసిన ఘనత ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారిది. మీ అందరి పక్షాన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు

ధర్నాలు, నిరహార దీక్షలు, రాస్తారోకోలు.. ఆర్టీసీ డిపో కోసం ఎన్నో జరిగాయి. అలాంటి కల నిజం అయింది

తెలంగాణ వచ్చాక మొట్టమొదటి ఆర్టీసీ డిపోను సీఎం గారు మంజూరు చేశారు. కరోనా రాకపోతే రెండేళ్ల క్రితమే డిపో వచ్చేది.

ఇంకా బస్సులు కావాలని మదన్ రెడ్డి గారు కోరారు. మంత్రి పువ్వాడ అజయ్ కావాల్సిన బస్సులు ఇస్తానని హమీ ఇచ్చారు.

బస్సులు ఇస్తే ఆటోలు ఎక్కుతాం అంటే కాదు.. ఆర్టీసీని కాపాడాలి. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది. ప్రమాదాలు తక్కువ.

ఢిల్లోని కేంద్రం ఏది అమ్ముదమా అని చూస్తున్నరు. రైల్వేలు, రైల్వేస్టేషన్లు, వి శాఖ ఉక్కు అన్ని అమ్ముతున్నరు. వాళ్లు అమ్ముడే కాకుండా రాష్ట్రాలకు పోటీ పెట్టారు. మీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే 2 వేల కోట్ల బహుమానం ఇస్తామన్నారు.

బీజేపీ పరిపాలన ఏలా ఉందంటే బావుల కాడ, బాయిల కాడ మీటర్లు పెడితే 25 వేల కోట్లు ఇస్తారంట, ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే 2 వేల కోట్లు ఇస్తారంట.

ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం పని చేయాలి. కాని బీజేపీ ప్రభుత్వం వ్యాపారధోరణితో పని చేస్తుంది. ఎలా లాభాలు సంపాదించాలని చూస్తోంది. ఆర్టీసీ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుంది.

బీజేపీని అడుగుతున్న మీ పాలసీ ఏంటి.. ఇప్పటికే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నరు. రేపు రాష్ట్రంలోకి బీజేపి వస్తే ఆర్టీసీని కూడా అమ్ముతరు.

ఆరు గంటల కరెంటే గంటకు గంటకు ట్రిప్ అవుతదంట కర్ణాటకలో. వాళ్లు తెలంగాణలో భూములు కొని, కర్ణాటక బోర్డర్ కు నీళ్లు పారించుకుంటున్నరు.

డబులు ఇంజన్ అంటరు.. కర్ణాటకలో బీజేపీ, కేంద్రంలో బీజేపీ. డబుల్ డెక్కర్ ప్రభుత్వం సక్కగా ఉంటే... తెలంగాణలోకి పైపులు వేసి కర్ణాటకలోని భూములకు నీళ్లు పెట్టుకుంటున్నరు.

బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి లేదు. రైతు బంధు లేదు. కాంగ్రెస్ వాళ్లు బాగా మాట్లడుతున్నరు. అధికారం ఇస్తే మేం ఏదో చెస్తమన్నరు.

కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎరువు బస్తా కోసం పోలీస్ స్టేషన్ల ముందు లైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. యాసంగి పంటలో పంటలు ఎండిపోతున్నయి.. మంజీర నీరు వదలమంటే, కాళేశ్వరం గెట్లు ఎత్తి ఒక్క గుంట కూడా ఎండకుండా పంటలు పండేలా నీళ్లు వదలడం జరిగింది.

కర్ణాటకలో 500 పెన్షన్, మన దగ్గర రెండు వేల రూపాయల పెన్షన్

కాంగ్రెస్ గవర్నమెంట్ లో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. సాగు నీళ్లు లేవు.

ఏడేళ్లలో నర్సాపూర్ ఎంత అభివృధ్ది చెందిందో చూడండి. బస్సు డిపో డీఎస్పీ ఆఫీసు నర్సాపూర్ కు వచ్చింది., హల్దీ,మంజీర మీద 15 చెక్ డాంలు కట్టాం. 70 ఏళ్లలో మంజీర మీద ఒక్క చెక్ డాం కట్టలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక 150 కోట్లతో 15 చెక్ డాంలు కట్టాం.

వడ్లు కొంటలేదని సెంటర్లకు వెళ్లి డ్రామలు చేశారు. ఒకరు పాదయాత్ర, ఇంకోకరు మోకాళ్ల యాత్ర.

300 కోట్ల రూపాయలతో వడ్లు కొన్నం. రైతుల అకౌంట్ లో పడ్డాయి.

కర్ణాటక వడ్లు దొడ్డి దారిన తెలంగాణలో 1900 రూపాయలకు అమ్ముతున్నరు. బీజేపీ వాళ్లు జోరుగా మాట్లాడారు. మరి అక్కడి వడ్లు ఇక్కడికి ఎందుకు తెచ్చి అమ్ముతున్నరు.

రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతున్నరు. చత్తీస్ ఘడ్ లో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నరా.. రైతు బంధు ఇస్తున్నరా.. అక్కడ ఎందుకు ఇవ్వడం లేదు.

ఏదంటే అదే ఇస్తమని కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్నరు. అధికారంలోకి వస్తే ప్రజలను మోసం చేద్దామన్న ధోరణితో ఉన్నరు.

మీరు ఇచ్చే వాళ్లు అయితే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు.

ఏదైనా గుజరాత్ కే ఇస్తున్నరు. మొన్న కేంద్ర కిషన్ రెడ్డి గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ హైదరాబాద్ లో పెడతామని ట్విట్టర్లో పెట్టారు. జాగా ఇవ్వమని మాకు లేఖ రాశారు. నేను వెంటనే జాగా ఇస్తం. పైసలిస్తం. హైదరాబాద్ లో పెట్టమని లేఖ రాశా.

రెండు రోజుల్లో అది గుజరాత్ లో పెట్టారు. కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతరు.

విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ లో పెట్టాలని ఉంది. ఎంపీలు కొట్లాడిండ్రు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారు.

మాటలు తెలంగాణకు.. మూటలు గుజరాత్ కు. తెలంగాణకు ఏం ఇచ్చిండ్రు.
161 views13:42
ओपन / कमेंट
2022-06-08 12:34:20
209 views09:34
ओपन / कमेंट
2022-06-08 12:34:17 వర్షాలు సంవృద్ధిగా కురిసి, రైతన్నలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు.
198 views09:34
ओपन / कमेंट
2022-06-08 10:39:01
237 views07:39
ओपन / कमेंट
2022-06-08 10:38:58 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెద్ద ఎత్తున చెక్‌‌‌‌‌‌‌‌ డ్యాంల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు.

#MissionKakatiya #KaleshwaramProject
230 views07:38
ओपन / कमेंट
2022-06-08 09:45:57
247 views06:45
ओपन / कमेंट
2022-06-08 09:45:53 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. ఇకపై వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులయ్యే వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయరాదని నిషేధం విధించింది.
238 views06:45
ओपन / कमेंट
2022-06-07 12:20:59
346 views09:20
ओपन / कमेंट
2022-06-07 12:20:37 బీజేపీ అంటే బడా జూటా పార్టీ: ఎమ్మెల్యే శ్రీ కె.పి. వివేకానంద గౌడ్
336 views09:20
ओपन / कमेंट