Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 12

2022-06-10 12:39:48
182 views09:39
ओपन / कमेंट
2022-06-10 12:39:25 జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి శ్రీ కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్నారు. ఉద్యమ నినాదానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువతరం అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. మళ్లీ 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపట్టామని తెలిపారు. 95 శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో తెలంగాణలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయి.

దేశాన్ని నడుపుతున్న నాలుగో రాష్ట్రం
రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా దూసుకెళ్తున్నాయన్నారు. ఓ వైపు పర్యావరణం, మరో వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో వచ్చిన నిధులను రాష్ట్రంలోనే ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశాన్ని నడుపుతున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల..
నీళ్ల విషయంలో దేశంలో 75 ఏండ్లలో జరగని పురోగతిని రాష్ట్రంలో సాధించామన్నారు. రూ.45 వేల కోట్లు ఖర్చుచేసి ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. మండు వేసవిలో కూడా కాలువల్లో నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం తెలంగాణలో ఉందన్నారు. లార్జెస్ట్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అని గూగుల్‌ కొడితే కాళేశ్వరం అని వస్తుందని చెప్పారు. నాలుగేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశామని వెల్లడించారు. 1964లో ఎస్‌ఆర్‌ఎస్పీకి అప్పటి ప్రధాని నెహ్రూ కొబ్బరికాయ కొడితే మొన్నటిదాకా కాల్వలు తవ్వారని విమర్శించారు.

కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా 82 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు ఎత్తిపోస్తున్నామని మంత్రి అన్నారు. 90 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరమని ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

జగిత్యాల జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ధాత్రి, భువి కంపెనీలు ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి ఆహ్వానిస్తున్నామన్నారు.

ఈ సభలో మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యేలు శ్రీ సంజయ్ కుమార్, శ్రీ సుంకె రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
181 views09:39
ओपन / कमेंट
2022-06-10 09:46:36
197 views06:46
ओपन / कमेंट
2022-06-10 09:46:26 జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం, బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కోదండరాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీ కేటీఆర్.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
195 views06:46
ओपन / कमेंट
2022-06-10 09:28:31
203 views06:28
ओपन / कमेंट
2022-06-10 09:28:25 మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 6.40 కోట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 110 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేసిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.
190 views06:28
ओपन / कमेंट
2022-06-10 09:05:37
198 views06:05
ओपन / कमेंट
2022-06-09 14:31:21
97 views11:31
ओपन / कमेंट
2022-06-09 14:31:17 తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి లేఖ రాసే బదులు రూ. 30,000 కోట్ల పై చిలుకు కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన బాకాయిలు వెంటనే విడుదల చేయాలని దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలి

* తెలంగాణ రైతాంగం పట్ల బీజేపీ మొసలికన్నీరు ఆపాలి
* ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బండి సంజయ్ రాసిన లేఖ నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది
* యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత నాది.. రైతులు వరి వేయాలి అన్న బండి సంజయ్ ఆ తరువాత మొఖం చాటేశాడు
* ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో యాసంగి వడ్లను కొనుగోలు చేశారు
* రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బండి సంజయ్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలి
* రైతుబంధుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.. రూ.7500 కోట్లకు రూ.580 కోట్లకు తేడా ఎంతో బండి సంజయ్ ఎవరినన్నా లెక్కలడిగి తెలుసుకోవాలి
* తెలంగాణ ప్రభుత్వం ఏటా రైతుల కోసం రైతుభీమాకు చేస్తున్న ఖర్చు రూ.1500 కోట్లు.. రైతుబంధు పథకం గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కి లేదు
* పంటలకు మద్దతుధర గురించి శభాష్.. శభాష్ అని బండి సంజయ్ చెప్పుకుంటున్నాడు.. వరి ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ. 3054, తాజాగా పెంచిన దాని ప్రకారం కేంద్రం క్వింటాలుకు ఇస్తున్న మద్దతుధర రూ.2060 మాత్రమే. బండి సంజయ్ కు మద్దతు ధరలపై అవగాహన శూన్యం కాబట్టి కనీసం పత్రికలు అయినా చదివి వివరాలు తెలుసుకోవాలి
* కేంద్రం మద్దతుధరలు ప్రకటించిన 14 పంటలలో పొద్దుతిరుగుడు మినహా మరే పంట సాగుచేసినా రైతులకు గిట్టుబాటు కాదు
* బండి సంజయ్ కి చేతనయితే గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాధన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ + 50 ప్రకారం పంటలకు మద్దతుధరలు ప్రకటించాలి.. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలి
* రైతుల సంక్షేమం రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు, సాగునీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. చేతనయితే ఈ పథకాలు కేంద్రం చేత రైతుల కోసం దేశమంతా అమలు చేయించాలి
* నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి 16 నెలల రైతుల పోరాటానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కు తీసుకున్న చరిత్ర ప్రధాని నరేంద్రమోడీది
* రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లిన మంత్రి కేటీఆర్ గారిని విమర్శిస్తున్న బండి సంజయ్ ఎనిమిదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చు, ఆయన వేసుకునే సూటు, బూటులకు అయిన ఖర్చు సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెచ్చుకుని చదువుకుంటే మంచిది
* వ్యవస్థ మీద, సమాజంలోని సమస్యల మీద ఏ మాత్రం ఆవాహనం లేని, అవగాహన తెచ్చుకోలేని బండి సంజయ్ లాంటి నేతలకు పదవులు ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాళ్లుగా మారాయి. ఇటీవల బీజేపీ నుండి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను చూసయినా బండి సంజయ్ సిగ్గు తెచ్చుకుని భాష మార్చుకోవాలి
* ఫసల్ భీమా పథకంలో అంత పస ఉంటే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదో అడిగి తెలుసుకోవాలి
* పాలమూరు పాదయాత్రలో ఆర్డీఎస్ అంతటికీ సాగునీళ్లు.. ఆరునెలలలో సమస్య పరిష్కారం అని చెప్పిన బండి సంజయ్ ఆ పనులు ఎంతవరకు వచ్చాయో పాలమూరు ప్రజలకు చెప్పాలి
* హైదరాబాద్ కార్పోరేటర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పావలా అయినా హైదరాబాద్ అభివృద్ధి కొరకు తీసుకొచ్చారా ?
* పత్రికా ప్రకటనల్లో బట్టలు చించుకోవడం మినహా బీజేపీ నేతలు రాష్ట్రానికి తెచ్చిన నిధులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు ఏమున్నాయో ప్రజలు గమనించాలి
* ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతుల గురించి.. రైతుల బాధల గురించి, ప్రభుత్వ బాధ్యతల గురించి బండి సంజయ్ చెప్పడం తాతకు దగ్గు నేర్పినట్లు ఉంది
* ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి లేఖ రాసే బదులు రూ. 30,000 కోట్ల పై చిలుకు కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన బాకాయిలు వెంటనే విడుదల చేయాలని దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలి
102 views11:31
ओपन / कमेंट
2022-06-08 16:42:38
184 views13:42
ओपन / कमेंट