2021-05-12 04:51:42
* చరిత్రలో ఈరోజు *
* మే 12 *
* సంఘటనలు *
0254: పోప్ లూసియస్-I తరువాత పోప్ సెయింట్ స్టీఫెన్-I, 23వ కేథలిక్ పోప్ అయ్యాడు.
1364: 'కాసిమిర్ III', పోలాండ్ రాజు 'జగీల్లోనియన్ యూనివర్సిటీ' (పోలాండ్ లోని అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం)ని నెలకొల్పమని, 'రాజ పత్రం' (రాయల్ ఛార్టర్) ఇచ్చాడు.
1459: 'సన్ సిటీ ఇండియా' గా పేరుగాంచిన జోధ్పూర్ ని, రాథోర్ (డ్) వంశానికి చెందిన, రాజ్పుట్ ప్రముఖుడు, 'రావు జోధ్' స్థాపించాడు.
1701: నెదర్లాండ్ లోని 'డ్రెన్త్' అనే ప్రాంతం గ్రెగొరియన్ కేలండర్ ని అమలు చేసింది (నిన్నటి రోజు తేది 1701 ఏప్రిల్ 29 నుంచి నేటి తేది 1701 మే 12 కి తేదీలు మారాయి. అంటే ఈ మధ్య రోజులు అన్నీ మాయమయ్యాయి అన్న మాట)
1777: మొట్టమొదటి 'ఐస్ క్రీం' ప్రకటన (ఫిలిప్ లెంజి - న్యూయార్క్ గెజెట్ లో ప్రకటించారు).1792: నియమిత సమయంలో దానంతట అదే శుభ్రం చేసుకునే మరుగుదొడ్లు (టాయిలెట్స్ ఫ్లషింగ్) పేటెంటు హక్కులు పొందారు.
1835: ఛార్లెస్ డార్విన్ ఉత్తర ఛిలి దేశంలో ఉన్న రాగి గనులను చూడటానికి వెళ్లాడు.
1908: 'నాథన్ బి. స్టబ్ల్ఫీల్డ్' 'వైర్లెస్ రేడియో ప్రసారానికి' పేటెంట్ హక్కులు తీసుకున్నాడు.
1921: మొట్ట మొదటి 'నేషనల్ హాస్పిటల్ డే' ని అమెరికాలో జరుపుకున్నారు.
1926: బ్రిటన్లో కార్మిక సంఘాలు చేసిన 9 రోజుల సాధారణ సమ్మెను విరమించారు.
1937: కింగ్ జార్జి VI పట్టాభిషేకం గ్రేట్ బ్రిటన్లో జరిగింది.
1942: 1500 మంది యూదులను 'ఆస్చ్విట్జ్ కాన్సెంట్రేషన్ కేంపు' లో విషవాయువు ద్వారా చంపేసారు. ఈ కేంపు నాజీ జర్మనీ ఆక్రమించిన పోలాండ్ లో ఉంది.
1942: అమెరికాకు చెందిన రవాణానౌకను, మిస్సిసిపి నదీ ముఖద్వారం దగ్గర, నాజీ లకు చెందిన యు-బోటు ముంచేసింది.
1943: జర్మన్ సైన్యం, ఉత్తర ఆఫ్రికాలో లొంగిపోయింది.
1949: అమెరికాలో మొట్ట మొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ని భారతదేశం నియమించింది.
1951: మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు)ను 'ఎనెవెటక్ అటోల్' అనే చోట పరీక్షించారు.
1952: 'గజ్ సింగ్' జోధ్పూర్ మహారాజుగా కిరీట ధారణ జరిగింది.
1956: తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) తీవ్రమైన తుఫాను, ఎత్తైన సముద్రపు అలలతో, అతలాకుతలమైంది.
1965: సోవియట్ యూనియన్ ప్రయోగించిన రోదసీనౌక లూనా 5 చంద్రుని నేల మీద నెమ్మదిగా దిగలేక కూలిపోయింది. ప్రయోగం విఫలమైంది.
1982: 'యు.ఎస్. ఫుట్బాల్ లీగ్' ఏర్పడింది.
1984:ఫ్రాన్స్ అణుబాంబును పరీక్షించింది.
1984: నెల్సన్ మండేలా,దక్షిణాఫ్రికాలో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు.
1986: అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
1991: పసిఫిక్ ప్రాంతపు వాయవ్య దిక్కులో దొరికే, అరుదైన మూలికతో కేన్సర్ వ్యాధికి ఒక కొత్త మందును కనుగొన్నారు.
1992: ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్గ్రిడ్ బేయెన్స్'.
1997: ఆస్ట్రేలియాకు చెందిన 'సుసాన్ జీన్ (సుసీ) మరోనీ' (22 సంవత్సరాలు),క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ - 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధితో పుట్టింది.
2002: మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.
2008: చైనాలోని సిచుయాన్లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.
2010: బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.
2010: 'ఆఫ్రిఖియా ఏర్వేస్' కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప.
2012: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయొజెనిక్ ఇంజిన్ ప్రయోగం సఫలమైంది. దీనిని, ఉపగ్రహ ప్రయోగ వాహకం జి.ఎస్.ఎల్.వి-డి5 లో బిగించుతారు. భారతదేశం, అమెరికాను ఈ ఇంజిన్లు అడిగినప్పుడు భారత దేశానికి ఇవ్వకుండగా, భారత దేశానికి అనేకమైన అడ్డంకులను కల్పించింది.
* జననాలు *
1401 : షొకొ చక్రవర్తి, జపాన్ 101వ చక్రవర్తి (మ. 1428)
1820: ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (మ. 1910)
1895: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్వవేత్త. (మ. 1986)
1899: ఇంద్రా దేవి, లాట్వియన్ యోగా గురువు (మ. 2002)
1920: వింజమూరి అనసూయ, జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత
1924: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు (మ.1999)
1926: భాట్టం శ్రీరామమూర్తి, జర్నలిస్టు, రాజకీయవేత్త.
1937: జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (మ.2008)
1945: కె. జి. బాలకృష్ణన్, భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి.
1950: షోజొ ఫుజీ, జూడో ఛాంపియన్
1951: గున్నార్ లార్సన్ స్వీడెన్, 200 మీట
420 views01:51