ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిష | Telugu News 24/7
ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈవీఎంలో అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హత, ఫొటోలు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం ను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం విచారించింది.
ఈవీఎంలో పార్టీ గుర్తులుండడంపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించి..పిటిషన్ ఉపసంహరించుకోవాలని పిటిషనర్కు ధర్మాసనం సూచన చేసింది.