2021-05-04 03:58:53
* ఆగస్టు 31 తర్వాతే నీట్ పీజీ*
* కరోనా నివారణ సేవల్లో వైద్య విద్యార్థులు*
* ప్రధాని నేతృత్వంలో నిర్ణయం*
దిల్లీ: * వైద్య విద్యార్థుల ద్వారా కరోనా రోగులకు సేవలు అందించాలని నిర్ణయించిన దృష్ట్యా నీట్-పీజీ పరీక్షలు మరో 4 నెలలపాటు వాయిదా పడనున్నాయి. ఆగస్టు 31 వరకు ఆ పరీక్షలు నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్ష నిర్వహించేది విద్యార్థులకు కనీసం నెలరోజుల ముందు చెప్పనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయం కారణంగా రోగులకు సేవలందించేందుకు పెద్దసంఖ్యలో డాక్టర్లు అందుబాటులోకి వస్తారని పేర్కొంది. సోమవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.*
* ★ఇంటర్న్షిప్లో వైద్యశిక్షణార్థులను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కొవిడ్ విధుల్లో నియమించనున్నారు.*
* ★తుది సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులను టెలీ కన్సల్టేషన్, తేలికపాటి లక్షణాలున్న రోగుల పర్యవేక్షణ, చికిత్స క్రమాన్ని నిర్ధరించడం లాంటి సేవలకోసం ఉపయోగించుకుంటారు.*
* ★కొత్త సంవత్సరం పీజీ విద్యార్థులు వచ్చేవరకు తుది సంవత్సరం పీజీ విద్యార్థుల సేవలను కొనసాగిస్తారు.*
* ★సీనియర్ డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణలో బీఎస్సీ/జీఎన్ఎం అర్హత ఉన్న నర్సులను ఫుల్టైం కొవిడ్ నర్సింగ్ డ్యూటీల్లో ఉపయోగించుకుంటారు.*
*★ కొవిడ్ విధుల్లో కనీసం 100 రోజులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం. వ్యాక్సిన్, కేంద్ర ప్రభుత్వ బీమా వర్తింప జేస్తారు.*
*★ కనీసం 100 రోజులపాటు కొవిడ్ విధులు నిర్వర్తించిన వారికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి కొవిడ్ జాతీయ సేవా సమ్మాన్ గౌరవాన్ని అందిస్తారు.*
* ★నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 2,206 స్పెషలిస్టులు, 4,685 మంది మెడికల్ ఆఫీసర్లు, 25,593 మంది స్టాఫ్ నర్సులను నియమిస్తారు.*
182 views00:58