Get Mystery Box with random crypto!

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావు ప్రసంగిస్తూ.. భార | TRS Party

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావు ప్రసంగిస్తూ.. భారతీయ ప్రాచీన చరిత్ర నుంచి నేటి వరకు నలంద విశ్వవిద్యాలయం పేరు వింటేనే యావత్ దేశం పులకించి పోతుందన్నారు. దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని చెప్పారు. దేశ రక్షణ కోసం పోరాడుతూ గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని శ్లాఘించారు. వీర సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేందుకే ఇక్కడి వచ్చామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యత అని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణా వికాసంలో భాగస్వామ్యం అవుతున్న బీహార్ బంధువులు ఎంతో మంది ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు మరణించారని విచారం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణకు వస్తున్న వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. కరోనా సమయంలో వారు ఇబ్బంది పడకుండా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.