కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో రూ.86 కోట్ల వ్యయంతో న | TRS Party
కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో రూ.86 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్ను పురపాలక మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కైతలాపూర్ ఆర్వోబీ అందుబాటులోకి రావడంతో కూకట్పల్లి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు దూరభారం, ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ మాధవరం కృష్ణారావు, శ్రీ కెపి వివేకానంద గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత, ఎమ్మెల్సీలు శ్రీ శంబీపూర్ రాజు, శ్రీ నవీన్ కుమార్, శ్రీమతి వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
#SRDP #HappeningHyderabad