AP: నర్సాపురం - మచిలీపట్నం మధ్య అసని తుపాన్ తీరందాటగా.. ప్రస్తుతం మచిలీపట్నం వద్ద వాయుగుండం నిశ్చలంగా కొనసాగుతోంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తాలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. రెడ్ అలర్టన్ను ఉపసంహరించి, ఎల్లో అలర్డ్ ను జారీ చేసింది.